పోస్ట్‌లు

ఆగస్టు, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ హనుమత్తాండవ స్తోత్రం

చిత్రం
1) వన్దే సిన్దూరవర్ణాభం లోహితామ్బరభూషితమ్ । రక్తాఙ్గరాగశోభాఢ్యం శోణాపుచ్ఛం కపీశ్వరమ్॥ భజే సమీరనన్దనం, సుభక్తచిత్తరఞ్జనం, దినేశరూపభక్షకం, సమస్తభక్తరక్షకమ్ । సుకణ్ఠకార్యసాధకం, విపక్షపక్షబాధకం, సముద్రపారగామినం, నమామి సిద్ధకామినమ్ ॥ 2) సుశఙ్కితం సుకణ్ఠభుక్తవాన్ హి యో హితం వచస్త్వమాశు ధైర్య్యమాశ్రయాత్ర వో భయం కదాపి న । ఇతి ప్లవఙ్గనాథభాషితం నిశమ్య వానరాఽధినాథ ఆప శం తదా, స రామదూత ఆశ్రయః ॥  3) సుదీర్ఘబాహులోచనేన, పుచ్ఛగుచ్ఛశోభినా, భుజద్వయేన సోదరీం నిజాంసయుగ్మమాస్థితౌ । కృతౌ హి కోసలాధిపౌ, కపీశరాజసన్నిధౌ, విదహజేశలక్ష్మణౌ, స మే శివం కరోత్వరమ్ ॥  4) సుశబ్దశాస్త్రపారగం, విలోక్య రామచన్ద్రమాః, కపీశ నాథసేవకం, సమస్తనీతిమార్గగమ్ । ప్రశస్య లక్ష్మణం ప్రతి, ప్రలమ్బబాహుభూషితః కపీన్ద్రసఖ్యమాకరోత్, స్వకార్యసాధకః ప్రభుః ॥  5) ప్రచణ్డవేగధారిణం, నగేన్ద్రగర్వహారిణం, ఫణీశమాతృగర్వహృద్దృశాస్యవాసనాశకృత్ । విభీషణేన సఖ్యకృద్విదేహ జాతితాపహృత్, సుకణ్ఠకార్యసాధకం, నమామి యాతుధతకమ్ ॥  6) నమామి పుష్పమౌలినం, సువర్ణవర్ణధారిణం గదాయుధేన భూషితం, కిరీటకుణ్డలాన్వితమ్ । సుపుచ్ఛగుచ్ఛతుచ్ఛలంకదాహకం సునాయకం విపక్షపక్షరా...

మా-రేడు

చిత్రం
  లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు . అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘ శ్రీఫలం ’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్రదం..అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగాలు రాకపోవ...

అంతర్యామి

  మానవజన్మ లభించడం దైవమిచ్చిన గొప్ప బహుమానంగా భావించాలి. మనమంతా ఇక్కడెందుకున్నాం.... నేనెవరు.... ఈ జీవితానికి అర్థం ఏమిటి... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోతే పరిశీలనకు నోచుకోని జీవితాలు అవుతాయి. మనసు గ్రహించిన దాన్నే గుడ్డిగా స్వీకరిస్తూపోవడం, అనాలోచితంగా ఇతరులను అనుసరించడం లాంటి ప్రమాదాల్లో పడతారు. అంతర్గతంగా ప్రయాణించినప్పుడు బహిర్గతంకాని సూక్ష్మమైన సత్యాలు తెలుస్తాయి. లోతైన అవగాహనే జీవితంలో మనిషి వేసుకునే అనేకానేక ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. సాదువులు, రుషులు దైవం ఒక సంపూర్ణమని నిర్వచించారు. మార్పులేనిది, కాలంతో సంబంధం లేనిదీ సత్యం అంటారు... ఒక్క పేరు తప్ప. అది వివిధ సంస్కృతులు, మతాలను అనుసరించి మారుతుంది. ఆశీస్సులు, స్పృహతో కూడిన సామర్థ్యం, శరీరం, ఇంద్రియాలు, ఆలోచనలతో... మనల్ని ఆ దైవం ప్రపంచంలోకి పంపించాడు. వీటిని ఉపయోగించి, ఎవరికి వారు ప్రేమతో దైవాన్ని తెలుసుకోగలగాలి. శూన్యంనుంచి ఆరంభమైన ప్రయాణం. జ్ఞానసముపార్జనతో లక్ష్యాన్ని తెలుసుకుని ప్రాపంచిక జీవనంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, జీవితాన్ని ఒక ఆటలా ఆడుతూనే సాగిపోవాలి. విస్తృత అవగాహనతో మన ఆత్యలను ఈ భూమినుంచి దైవసాన్నిధ్యానికి...